Thursday, March 19, 2026
HomeNewsAndhra Pradeshజ‌గ‌న్ కు భారీ షాక్ పులివెందుల‌లో ఓట‌మి 30 ఏళ్ల చ‌రిత్ర‌లో రికార్డ్

జ‌గ‌న్ కు భారీ షాక్ పులివెందుల‌లో ఓట‌మి 30 ఏళ్ల చ‌రిత్ర‌లో రికార్డ్

Published on


రాయ‌ల‌సీమ‌లో ముఖ్యంగా క‌డ‌ప జిల్లాలో వైయ‌స్ కుటుంబానికి రాజకీయంగా తిరుగులేదు, శాస‌న స‌భ ఎన్నిక‌లు అయినా పార్ల‌మెంట్ ఎన్నిక‌లు అయినా స్ధానిక సంస్ధ‌ల‌ ఎన్నిక‌లు అయినా వారి కుటుంబం లేదా వారు బ‌ల‌ప‌రిచిన అభ్య‌ర్దులు విజ‌యం సాధిస్తారు. కాని ఫ‌స్ట్ టైమ్ వైయ‌స్ కుటుంబానికి ఇక్క‌డ ఓట‌మి దెబ్బ త‌గిలింది.
ఏపీ రాజకీయాల్లో సంచలనం నమోదయింది.

40 ఏళ్లుగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా నిలిచిన పులివెందులలో టీడీపీ సత్తా చాటింది. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో వైసీపీ ఓట‌మి మూట‌క‌ట్టుకుంది. అస‌లు వైసీపీ ఊహించ‌ని విజ‌యంగా ఇది న‌మోదు అయింది. టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి బీటెక్ రవి భార్య 6,050 ఓట్ల భారీ మెజార్టీతో జయకేతనం ఎగురవేశారు. వైసీపీ త‌ర‌పున నిల‌బ‌డిన హేమంత్ రెడ్డి డిపాజిట్ కూడా పొంద‌లేక‌పోయారు.

ఇటీవ‌ల జ‌రిగిన పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక‌ల్లో మొత్తం 8103 ఓట్లు పోల్ అయ్యాయి, టీడీపీ అభ్య‌ర్ది మారెడ్డి లతారెడ్డికి 6,735 ఓట్లు పడ్డాయి.వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి కేవలం 685 ఓట్లు మాత్రమే పడ్డాయి.
ఇద్ద‌రికి చాలా గ‌ట్టి పోటీ ఉంటుంది అని భావిస్తే, కేవ‌లం 10 శాతం కూడా ప్ర‌భావం చూపించ‌లేక‌పోయింది వైసీపీ. ఈ ఘ‌న విజ‌యంతో కూటమి శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.

Also Read  Big Boss Telugu Season 9: ఫైనల్ కి చీఫ్ గెస్ట్ ఫిక్స్ !

వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ కు కూడా ఇలాంటి ఫ‌లితాలు వ‌స్తాయి అని కూట‌మి నేత‌లు కామెంట్లు చేస్తున్నారు..30 ఏళ్ల తర్వాత పులివెందుల జడ్పీ పీఠం టీడీపీ వశమైంది. గ‌త చ‌రిత్ర చూసుకుంటే 2016 ముందు వైయ‌స్ కుటుంబం నిల‌బెట్టిన వారు ఐదు సార్లు ఏక‌గ్రీవంగా ఎన్నిక అయ్యారు.. గొడవలు, అరెస్టులు, రీపోలింగ్ ఎన్నో జ‌రిగాయి ఫైన‌ల్ గా టీడీపీ త‌న స‌త్తా చాటింది ఇక్క‌డ‌.

Latest articles

Gold Murder:బంగారం కోసం వృద్ధురాలి దారుణ హత్య..

బంగారం కోసం వృద్ధురాలిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన నల్గొండ జిల్లా హాలియాలో తీవ్ర కలకలం రేపింది....

Blinkit: 10 నిమిషాల ఆన్లైన్ డెలివరీ బంద్..

గిగ్ వర్కర్ల డిమాండ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 10 నిమిషాల ఆన్లైన్ డెలివరీ విధానాన్ని...

Telangana govt:భారీగా బీర్ల ఉత్పత్తి.. కంపెనీలకు ప్రభుత్వ నిర్దేశం

వేసవికాలంలో బీర్లకు డిమాండ్ భారీగా పెరుగుతుండటంతో వాటి ఉత్పత్తిని మరింత పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత వేసవిలో రోజుకు...

Mary Kom Divorce:‘జూనియర్ బాక్సర్తో మేరీ కోమ్కు అఫైర్’.. మాజీ భర్త సంచలన ఆరోపణలు

తనను మోసం చేసి ఆస్తులు లాక్కున్నారన్న మేరీ కోమ్ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని ఆమె మాజీ భర్త...

Youtuber Anvesh :ట్రావెలింగ్ ఆపేస్తున్నా!

తాను ట్రావెలింగ్ ఆపేద్దామనుకుంటున్నట్లు యూట్యూబర్ అన్వేష్ తెలిపారు. “130 దేశాలు తిరిగాను. ఇక సంపాదించింది చాలు. నా దగ్గర...

Senior citizens : కోసం డేకేర్ సెంటర్లు..

తెలంగాణలోని వృద్ధులకు శుభవార్త. 60 ఏళ్లు పైబడిన వృద్ధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 37 ‘డేకేర్ సెంటర్లు’ ఏర్పాటు...

More like this

Viswambhara :జులై 10న చిరంజీవి ‘విశ్వంభర’ రిలీజ్?

మెగాస్టార్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న భారీ ఫాంటసీ చిత్రం విశ్వంభర విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చినట్లు సినీ వర్గాలు...

Shankar Drea Project: నిర్మాత… కానీ కఠిన నిబంధనలతో!

భారతీయ సినీ పరిశ్రమలో విజువల్ గ్రాండియర్‌కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన దర్శకుడు శంకర్ ఎప్పటినుంచో కలగా భావిస్తున్న ప్రాజెక్ట్...

Champion Movie:OTTలోకి వచ్చేసిన ‘ఛాంపియన్’ మూవీ

యువ హీరో రోషన్ ప్రధాన పాత్రలో నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఛాంపియన్ ఇప్పుడు OTTలోకి వచ్చేసింది. గత...