
హర్షద్ మెహతా స్కామ్ నుంచి COVID-19 మహమ్మారి వరకు: భారత స్టాక్ మార్కెట్ చరిత్రలోని టాప్ 5 క్రాష్లు
స్టాక్ మార్కెట్ క్రాష్ టుడే: నేడు భారత మార్కెట్లలో భారీగా పతనం జరిగింది. గ్లోబల్ మార్కెట్లలో తీవ్ర ఊగిసలాట కారణంగా ఇండియన్ స్టాక్ ఇండెక్సులు రక్తసిక్తమయ్యాయి.
సెన్సెక్స్, నిఫ్టీ రెండూ ప్రారంభ ట్రేడింగ్లోనే 5 శాతం కంటే ఎక్కువగా కుప్పకూలాయి.
నిఫ్టీ 50లో ఊహించిన వోలాటిలిటీని కొలిచే ఇండియా VIX 56.50 శాతం పెరిగి 21.53కి చేరింది. దీని అర్థం మార్కెట్లో భారీ ఊగిసలాట ఉండబోతోందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు.
నిఫ్టీ 1,160.8 పాయింట్లు (-5.06%) పడిపోయి 21,743.65కి చేరింది –
ఇది గత 12 నెలల్లోనే అతిపెద్ద పతనాల్లో ఒకటి. అదే విధంగా, BSE సెన్సెక్స్ 3,939.68 పాయింట్లు (-5.22%) తగ్గి 71,425.01కి చేరింది.
సెన్సెక్స్లోని అన్ని కంపెనీలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. టాటా స్టీల్, టాటా మోటార్స్ 10 శాతానికి పైగా పడిపోయాయి. లార్సెన్ & టూబ్రో, హెచ్ఎస్ఎల్ టెక్నాలజీస్, అదానీ పోర్ట్స్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, మహీంద్రా & మహీంద్రా వంటి బడా కంపెనీలు భారీ నష్టాల్ని చవిచూశాయి.
ఇక, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అమలు చేసిన అనూహ్య దిగుమతి సుంకాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితుల మధ్య మార్కెట్ ట్రేడింగ్ కొనసాగుతుండగా, భారత్లో జరిగిన పలు ప్రధాన స్టాక్ మార్కెట్ పతనాలను పరిశీలిద్దాం.
1. హర్షద్ మెహతా స్కామ్ క్రాష్ (1992):
ఇది భారత స్టాక్ మార్కెట్ తొలిసారిగా పెద్ద స్థాయిలో కుదేలైన సమయం. ఏప్రిల్ 28, 1992న సెన్సెక్స్ ఒక్కరోజే 570 పాయింట్లు (-12.7%) పడిపోయింది.
2. కేతన్ పరేఖ్ స్కామ్ క్రాష్ (2001):
బ్రోకర్ కేతన్ పరేఖ్ స్కామ్ వెలుగులోకి వచ్చిన తరువాత, మార్చి 2, 2001న సెన్సెక్స్ 176 పాయింట్లు (-4.13%) పడిపోయింది.
3. ఎలెక్షన్ షాక్ క్రాష్ (2004):
మే 17, 2004న యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (UPA) అనూహ్య విజయం సాధించిన నేపథ్యంలో సెన్సెక్స్ ఒక్కరోజే 11.1 శాతం పడిపోయింది.
4. గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ క్రాష్ (2008):
జనవరి 21, 2008న గ్లోబల్ రిసెషన్ భయాలు, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కారణంగా సెన్సెక్స్ 1,408 పాయింట్లు (-7.4%) పడిపోయింది.
5. కోవిడ్-19 మహమ్మారి క్రాష్ (2020):
మార్చి 23, 2020న కోవిడ్ ప్రభావంతో దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించడంతో భయాందోళనలు చెలరేగాయి. సెన్సెక్స్ 3,935 పాయింట్లు (-13.2%) పడిపోయింది. ఇది ఒకే రోజులో జరిగిన అతిపెద్ద పతనాల్లో ఒకటి.
ఇవి భారత స్టాక్ మార్కెట్ చరిత్రలోనే మర్చిపోలేని పతనాలుగా నిలిచిపోయాయి.