Wednesday, September 16, 2026
HomeNewsMirjaguda Accident: బస్సు ప్రమాదం – పర్యావరణ ప్రేమికులు కారణమా?

Mirjaguda Accident: బస్సు ప్రమాదం – పర్యావరణ ప్రేమికులు కారణమా?

Published on

ప్రమాదం వివరాలు:
రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును ఎదురుగా వచ్చిన టిప్పర్ అతివేగంగా ఢీకొట్టింది. టిప్పర్ బస్సులో కుడివైపున ఉన్న 6 సీట్ల వరకు చొచ్చుకొచ్చింది. దీని కారణంగా ప్రయాణికులు కంకరలో కూరుకుపోయారు. డ్రైవర్ దస్తగిరి బాబు అక్కడికక్కడే మృతి చెందగా, కండక్టర్ రాధ గాయాలతో బయటపడింది. ఈ ప్రమాదంలో మొత్తం 19 మంది మరణించారు.

ప్రమాదానికి కారణాలు:
బస్సు, టిప్పర్ రెండూ ఓవర్‌స్పీడ్‌లో నడుస్తున్నాయని అధికారులు చెప్పారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో మూల మలుపు ఉండటంతో ఢీ కొట్టే వేళ కంకర మొత్తం బస్సులోకి రావడం జరిగింది. రోడ్డు సన్నగా ఉండటం, రహదారి విస్తరణ పనులు ఆలస్యమవడం ప్రమాద తీవ్రతకు మొదటి కారణం.

రెస్క్యూ ఆపరేషన్:
చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి మృతదేహాలతో నిండిపోయింది. గాయపడినవారిని బెంచ్లపై పడుకోబెట్టి చికిత్స అందిస్తున్నారు. కొందరిని ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తున్నారు. గాంధీ ఆసుపత్రి నుండి వైద్యుల బృందం అక్కడికి చేరుకుంది.

Also Read  Solar Pannels: చంద్రుని వెలుగులో పనిచేసే సోలార్ ప్యానెల్స్

బాధాకర దృశ్యాలు:
ఒక మహిళ మృతి చెందగా, ఆమె భర్త ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వారి ముగ్గురు పిల్లలు అదృష్టవశాత్తు సురక్షితంగా బయటపడ్డారు. తల్లి మృతి, తండ్రి ఆసుపత్రిలో ఉండటంతో ఆ చిన్నారులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.

ప్రజా ఆగ్రహం:
మీర్జాగూడ గ్రామస్థులు రాస్తారోకో చేపట్టారు. “హైవే పనులు ఎందుకు పూర్తిచేయలేదు?” అంటూ నినాదాలు చేస్తున్నారు. ప్రమాద స్థలానికి వచ్చిన ఎమ్మెల్యే కాలే యాదయ్యను స్థానికులు అడ్డుకున్నారు. రోడ్డు పనులు ఆలస్యం చేశారని నిలదీశారు. దీంతో ఎమ్మెల్యే వెనక్కి వెళ్లిపోయారు.

రాజకీయ నాయకుల స్పందనలు:

  • ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.
  • పవన్ కళ్యాణ్ గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.
  • ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేసి, మృతుల కుటుంబాలకు ₹2 లక్షలు, గాయపడిన వారికి ₹50,000 చొప్పున పరిహారం ప్రకటించారు.
  • తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ప్రమాద స్థలానికి పంపి సహాయక చర్యలు వేగంగా చేపట్టాలని ఆదేశించారు. గాయపడిన వారిని హైదరాబాద్కు తరలించి మెరుగైన వైద్యం ఇవ్వాలని సూచించారు.
Also Read  "ఉబర్, ఓలా, రాపిడో డ్రైవర్లకు ప్రయోజనం చేకూర్చే ప్రభుత్వ 'సహకార్ టాక్సీ' యాప్.

అధికారుల చర్యలు:
సహాయక చర్యల పర్యవేక్షణ కోసం సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.
సంప్రదించవచ్చిన నంబర్లు: 9912919545, 9440854433

రెస్క్యూ సమయంలో మరో ఘటన:
మృతదేహాలను వెలికితీసే సమయంలో విధుల్లో ఉన్న CI భూపాల్ శ్రీధర్ కాళ్లపై JCB వెళ్లి గాయపడ్డాడు. ఆయనను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

రోడ్డు సమస్య:
స్థానికులు రోడ్డు విస్తరణ పనులు ఐదేళ్లుగా ఆగిపోయాయని తెలిపారు. “చెట్లు నాశనం అవుతాయని పర్యావరణ ప్రేమికులు గ్రీన్ ట్రిబ్యునల్‌కి వెళ్ళడంతో పనులు ఆగిపోయాయి” అని చెప్పారు.

Latest articles

Gold Murder:బంగారం కోసం వృద్ధురాలి దారుణ హత్య..

బంగారం కోసం వృద్ధురాలిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన నల్గొండ జిల్లా హాలియాలో తీవ్ర కలకలం రేపింది....

Blinkit: 10 నిమిషాల ఆన్లైన్ డెలివరీ బంద్..

గిగ్ వర్కర్ల డిమాండ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 10 నిమిషాల ఆన్లైన్ డెలివరీ విధానాన్ని...

Telangana govt:భారీగా బీర్ల ఉత్పత్తి.. కంపెనీలకు ప్రభుత్వ నిర్దేశం

వేసవికాలంలో బీర్లకు డిమాండ్ భారీగా పెరుగుతుండటంతో వాటి ఉత్పత్తిని మరింత పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత వేసవిలో రోజుకు...

Mary Kom Divorce:‘జూనియర్ బాక్సర్తో మేరీ కోమ్కు అఫైర్’.. మాజీ భర్త సంచలన ఆరోపణలు

తనను మోసం చేసి ఆస్తులు లాక్కున్నారన్న మేరీ కోమ్ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని ఆమె మాజీ భర్త...

Youtuber Anvesh :ట్రావెలింగ్ ఆపేస్తున్నా!

తాను ట్రావెలింగ్ ఆపేద్దామనుకుంటున్నట్లు యూట్యూబర్ అన్వేష్ తెలిపారు. “130 దేశాలు తిరిగాను. ఇక సంపాదించింది చాలు. నా దగ్గర...

Senior citizens : కోసం డేకేర్ సెంటర్లు..

తెలంగాణలోని వృద్ధులకు శుభవార్త. 60 ఏళ్లు పైబడిన వృద్ధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 37 ‘డేకేర్ సెంటర్లు’ ఏర్పాటు...

More like this

Viswambhara :జులై 10న చిరంజీవి ‘విశ్వంభర’ రిలీజ్?

మెగాస్టార్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న భారీ ఫాంటసీ చిత్రం విశ్వంభర విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చినట్లు సినీ వర్గాలు...

Shankar Drea Project: నిర్మాత… కానీ కఠిన నిబంధనలతో!

భారతీయ సినీ పరిశ్రమలో విజువల్ గ్రాండియర్‌కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన దర్శకుడు శంకర్ ఎప్పటినుంచో కలగా భావిస్తున్న ప్రాజెక్ట్...

Champion Movie:OTTలోకి వచ్చేసిన ‘ఛాంపియన్’ మూవీ

యువ హీరో రోషన్ ప్రధాన పాత్రలో నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఛాంపియన్ ఇప్పుడు OTTలోకి వచ్చేసింది. గత...