
2030 కామన్వెల్త్ క్రీడలను నిర్వహించేందుకు బిడ్డింగ్ ప్రక్రియను క్రీడా శాఖ అధికారులు వివరించారు. ఒలింపిక్ తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడానికి భారతదేశం సిద్ధమవుతోంది. 2030 క్రీడలను గుజరాత్లో నిర్వహించేందుకు క్రీడా శాఖ ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. ఈ ఆటల నిర్వహణకు ఆసక్తి ఉన్న దేశాలు తమ అభ్యర్థనలను ఈ నెల 31నాటికి సమర్పించాలని నిర్ణయించారు. కొన్ని రోజుల క్రితమే, భారత ఒలింపిక్ అసోసియేషన్ ఈ లేఖను పంపించిందని తెలిపారు. కామన్వెల్త్ క్రీడలకు 2010లో తొలిసారిగా భారతదేశం ఆతిథ్యం అందించింది. మరోసారి ఈ క్రీడలను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. 2030లో జరగనున్న పోటీల కోసం భారతదేశం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అలాగే, 2036లో ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడానికి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి భారతదేశం తన సిద్ధతను ఇప్పటికే తెలియజేసింది. అయితే, దానికి ముందే 2030లో కామన్వెల్త్ క్రీడలను గుజరాత్లో నిర్వహించేందుకు భారతదేశం చాలా ఆసక్తి చూపుతోంది.”