Monday, October 20, 2025
HomeNewsఅక్క‌డ‌ 80 మృతదేహాలు పాతిపెట్టాను...ధర్మస్థల కేసులో సాక్షి చెప్పిన సంచ‌ల‌న విష‌యాలు తీరా తవ్వి చూస్తే?

అక్క‌డ‌ 80 మృతదేహాలు పాతిపెట్టాను…ధర్మస్థల కేసులో సాక్షి చెప్పిన సంచ‌ల‌న విష‌యాలు తీరా తవ్వి చూస్తే?

Published on

కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఉన్న ధర్మస్థల‌ ఇప్పటి వరకు ఇది మంజునాథుడి ఆలయం నుంచి ఆధ్యాత్మిక ప్రాంతంగానే అంద‌రికి తెలుసు.

అయితే గ‌త కొన్ని నెల‌లుగా ఒక సంఘ‌ట‌న దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌కు కార‌ణం అయింది. గ‌త‌ నెలలో ఓ న్యాయవాదితో కలిసి అక్కడి పోలీసుస్టేషన్‌కు వచ్చిన వ్యక్తి చేసిన ఫిర్యాదు అందరినీ ఉలిక్కిపడేలా చేసింది.

ధర్మశాల దేవాలయంలో పారిశుద్ధ్య కార్మికుడిగా పని చేసిన తాను దాదాపు 20 ఏళ్ల పాటు అనేక మృతదేహాలను పాతిపెట్టానని బాంబు పేల్చాడు.

అలా చ‌నిపోయిన వారిలో మహిళలు, చిన్నారులు ఉన్నారని, కొందరిపై అత్యాచారం జరిగినట్లు, మరికొందరిపై యాసిడ్‌ దాడులకు సంబంధించిన గుర్తులు ఉన్నాయని అంతా ఉలిక్కిపడేలా చేశాడు. ఆ మృత‌దేహాల‌ని తాను పూడ్చాను అని సంచ‌ల‌న విష‌యాలు చెప్పాడు.

అయితే ఆ వ్య‌క్తి ఇలాంటి విష‌యాలు చెప్ప‌డంతో, పోలీసులు కేసు న‌మోదు చేశారు, దీనిని సిద్ద‌రామ‌య్య స‌ర్కార్ చాలా సీరియ‌స్ గా తీసుకుంది.

Also Read  17 ఏళ్ల తర్వాత చారిత్రాత్మక విజయం:

అక్క‌డ క‌ర్ణాట‌క‌ ప్ర‌భుత్వం సిట్ వేసింది. సాక్షి చెబుతున్న చోట్ల త‌వ్వ‌కాలు జ‌రుపుతోంది… ఈ అంశం పై సిట్ అధికారులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.

విజిల్ బ్లోయర్ ఇచ్చిన ఆధారాలు, చెప్పిన విషయాలతో ధర్మస్థల లో తవ్వకాలు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే కొన్ని చోట్ల కొన్ని ఆన‌వాళ్లు దొరికాయి. అయితే వాటిపై లోతైన ప‌రిశోధ‌న చేస్తున్నారు అధికారులు.

తాజాగా మ‌రో విషయం చెప్పాడు ఆ సాక్షి, ఒకేచోట దాదాపు 80 మృత‌దేహాల‌ను తానే గొయ్యి త‌వ్వి పాతేశానుఅంటున్నాడు, ఈ మాట విన‌డానికి కూడా కాస్త ఆశ్చ‌ర్యంగానే ఉంది అంటున్నారు అధికారులు

ప్ర‌జ‌లు అయితే అన్నీ కోణాల్లో విచార‌ణ చేస్తుంది సిట్. 1998 నుంచి 2014 మధ్య శానిటైజేషన్ వర్కర్‌గా పనిచేసిన ఆ వ్యక్తి ఈ కీల‌క విష‌యాలు బ‌య‌ట‌పెట్టాడు.

ఇప్పుడు ఎందుకు ఈ విష‌యాలు బ‌య‌ట‌పెట్టావు అని ప్ర‌శ్నిస్తే, నేను చేసిన పాపం చెప్పాలి, నాకు నిద్ర ప‌ట్ట‌డం లేదు ఆ శ‌వాలు అస్దిపంజ‌రాలు త‌న‌కు గుర్తు వ‌స్తున్నాయి అని తెలియ‌చేస్తున్నాడు.

Also Read  తెలంగాణలో జనవరి 26 నుండి కొత్త పథకాలు ప్రారంభం..

నేత్రావతి నది ఒడ్డున ధర్మస్థల అటవీ ప్రాంతంలో తాను ఒక్కడినే చాలా శవాలను గొయ్యితీసి పాతిపెట్టినట్లు ఆ ప్రధాన సాక్షి తెలిపాడు.

ఆలయ పర్యవేక్షకులు త‌న‌కు ఈప‌ని అప్ప‌చెప్పారు అని వారు ఎవ‌రూ త‌న‌తో నేరుగా చెప్ప‌కపోయినా వారి సిబ్బందితో నాకు అమ‌లు చేయ‌మ‌ని చెప్పాడు అంటున్నాడు.

15 ప్రాంతాల్లో సిట్ అధికారులు తవ్వకాలు జరిపించగా.. సైట్‌ నంబర్‌ 6లో మాత్రమే ఓ మానవ అస్థిపంజరం లభించింది. సైట్‌ నంబర్‌ 13లో 80 మృతదేహాలను పాతిపెట్టినట్లు అత‌ను చెబుతున్నాడు.

అయితే అక్క‌డ చాలా లోతుగా తాను శ‌వాల‌ను పూడ్చాను అంటున్నాడు. దానిపై కూడా విచార‌ణ చేస్తున్నారు అధికారులు.

అటవీ ప్రాంతాలు, పాత రోడ్లపై మాత్రమే మృతదేహాలను పాతిపెట్టేవాళ్లం అని చెబుతున్నాడు. అయితే ఇప్పుడు చాలా మారిపోయింది ఆ ప్రాంతం.

రోడ్లు వెడ‌ల్పు అయ్యాయి అందులో కొన్ని తాను గుర్తుప‌ట్ట‌లేక‌పోతున్నాను అంటున్నాడు. వర్షాలతో భూమి కోతకు గురికావడం, అడవులు పెరిగిపోవడం, నిర్మాణ పనుల కారణంగా పాతిపెట్టిన ప్రాంతాలు త‌న‌కు అంత‌గా గుర్తు లేవు అంటున్నాడు, అయితే సిట్ మాత్రం మార్క్ చేసిన‌వి గుర్తించి ప్రాంతాల్లో త‌వ్వ‌కాలు చేస్తోంది.

Also Read  Krishak Bharati Cooperative Limited (KRIBHCO), Graduate Engineer Trainee (GET) Recruitment for 2025.

Latest articles

Sliver Stolen: ఒక్కక్షణం ఆగినందుకు 11 కిలోల వెండి మాయం.

ఉత్తర తూర్పు ఢిల్లీలోని న్యూ ఉస్మాన్‌పూర్ ప్రాంతంలో ఆశ్చర్యపరిచే ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై జరిగిన చిన్న గొడవలో స్కూటర్...

ICC Women’s Cricket World Cup 2025: Full Schedule, Teams, Venues & Key Matches

The ICC Women’s Cricket World Cup 2025 is set to bring thrilling action to...

T20 Asia & EAP Qualifier 2025: వరల్డ్ కప్ అర్హతలు.

T20 వరల్డ్ కప్ అనేది ప్రపంచంలో టాప్ క్రికెట్ దేశాలు పోటీ పడే ఒక క్రికెట్ టోర్నమెంట్.ఇది చిన్న...

Bigg Boss Kannada 11: కాలుష్యం కారణంగా Karnataka Pollution Board ఆపేయమన్న ఆదేశం.

. బిగ్ బాస్ కన్నడ సీజన్ 11 షూటింగ్ ప్రదేశం చుట్టూ పర్యావరణ కాలుష్యం పెరుగుతోందని గుర్తించిన కర్ణాటక రాష్ట్ర...

Kerala Lottery:పేదలకు కలలు నెరవేర్చే ప్రభుత్వ బహుమతి

పరిచయం భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు మాత్రమే లాటరీలను చట్టబద్ధంగా నిర్వహిస్తున్నాయి. వాటిలో కేరళా రాష్ట్రం తన లాటరీ వ్యవస్థతో ప్రత్యేక...

High Court:కేవలం బాధితురాలి సాక్ష్యం సరిపోదు … హైకోర్టు పదేళ్ల జైలు శిక్షను రద్దు చేసింది.

హైదరాబాద్ కిషన్బాగ్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ ఇర్ఫాన్ఖాన్ పై నమోదైన అత్యాచార కేసులో నాంపల్లి కోర్టు విధించిన 10...

More like this

Google Data Center: APకి వెళ్లడం వెనుక ఉన్న నిజాలు..

గత కొన్ని రోజులుగా గూగుల్ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడులు పెట్టబోతోందనే వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. ఈ...

Final Destination: Bloodlines – భయానక హారర్ ఇప్పుడు Jio Hotstar లో

భయానక సినిమాలు చూడటం ఇష్టమా? అయితే మీకు గుడ్ న్యూస్! ప్రముఖ హారర్ ఫ్రాంచైజీ “Final Destination” సిరీస్‌లో...

YouTube Down: కానీ ఎందుకు? కారణం తెలుసా?

ప్రపంచంలో ప్రతి రోజు కోట్ల మంది వీడియోలు చూసే YouTube ఒక్కసారిగా పనిచేయకపోవడం అమెరికాలో పెద్ద సమస్యగా మారింది....