Saturday, January 31, 2026
HomemoneyGoogle Data Center: APకి వెళ్లడం వెనుక ఉన్న నిజాలు..

Google Data Center: APకి వెళ్లడం వెనుక ఉన్న నిజాలు..

Published on

గత కొన్ని రోజులుగా గూగుల్ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడులు పెట్టబోతోందనే వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక్ మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.

మంత్రి ఖర్గే మాట్లాడుతూ, “గూగుల్ ఏపీకి వెళ్లడానికి చాలా కారణాలు ఉన్నాయి. అక్కడి ప్రభుత్వం ఆ సంస్థకు రూ.22,000 కోట్ల విలువైన ప్రోత్సాహకాలు అందించింది. అంతేకాకుండా స్టేట్ GSTలో 100% రీయింబర్స్‌మెంట్ ఇవ్వడం జరిగింది. భూమి కూడా 25% డిస్కౌంట్‌తో కేటాయించారు. నీటి టారిఫ్‌లో 25% తగ్గింపు ఇచ్చారు. అంతే కాదు, ట్రాన్స్‌మిషన్ ఫెసిలిటీలను 100% ఉచితంగా అందించనున్నారు,” అని చెప్పారు.

అయితే, ఆయన స్పష్టంగా పేర్కొన్నది ఏమిటంటే — “ఈ రాయితీలు, ప్రోత్సాహకాలు అన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చింది. కానీ మీడియా మాత్రం గూగుల్ ఏపీకి వచ్చింది అని మాత్రమే హైలైట్ చేస్తోంది. అసలు నేపథ్యాన్ని ఎవరూ ప్రస్తావించడం లేదు. ఇలాంటి ప్రోత్సాహకాలు మేము ఇస్తే, కర్ణాటక ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నారని విమర్శిస్తారు. కానీ ఇతర రాష్ట్రాలు ఇస్తే దాన్ని అభివృద్ధిగా చూపిస్తారు,” అని అన్నారు.

Also Read  ఇంట్లో క్యాష్ ఎంత ఉంచుకోవ‌చ్చో మీకు తెలుసా?

మరింతగా మాట్లాడుతూ, “బెంగళూరులో జనాభా పెరుగుతోందని కొందరు అంటున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణా నుండి వేలాది మంది ఇక్కడ ఉద్యోగాలు చేస్తే అది కూడా జనాభా పెరుగుదలకే కదా? అందువల్ల దీనిని అభివృద్ధి సంకేతంగా చూడాలి, సమస్యగా కాదు,” అని ఆయన పేర్కొన్నారు.

మంత్రి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీశాయి. కొందరు ఆయన అభిప్రాయాలను సమర్థించగా, మరికొందరు ప్రతిపక్ష వైఖరిని ఎత్తిచూపుతున్నారు. గూగుల్ పెట్టుబడులు ఏ రాష్ట్రానికైనా ఆర్థికాభివృద్ధి, ఉపాధి అవకాశాలు తెస్తాయన్నది వాస్తవమే. కానీ ఇలాంటి భారీ పెట్టుబడుల వెనుక ప్రభుత్వాలు ఇచ్చే ప్రోత్సాహకాలు కూడా ప్రజలకు పారదర్శకంగా తెలియజేయడం అవసరం అని నిపుణులు సూచిస్తున్నారు.

Latest articles

ChatGPT,Geminiతో Food Order:Swiggy App Open చేయాల్సిన పనిలేదు!

ఇక ఫుడ్ ఆర్డర్ చేయాలంటే తప్పనిసరిగా స్విగ్గీ యాప్ ఓపెన్ చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. త్వరలోనే Swiggy ఒక...

IPO: రికార్డ్ సృష్టించనున్న రిలయన్స్ జియో..

రిలయన్స్ జియో త్వరలో ఐపీఓకు రానున్న విషయం తెలిసిందే. ఈ ఐపీఓ ద్వారా సుమారు రూ.40 వేల కోట్ల...

Sankranthi Festival:HYD-VJA హైవేపై ప్రయాణించేవారికి గుడ్ న్యూస్…

హైదరాబాద్–విజయవాడ హైవేపై ప్రయాణించేవారికి గుడ్ న్యూస్. ఇకపై ఈ మార్గంలో టోల్ గేట్ వద్ద వాహనాల ఆగకుండా ప్రయాణించేలా...

Hydrogen Train:దేశంలోనే తొలి ‘హైడ్రోజన్ ట్రైన్’ సిద్ధం…

భారత రైల్వే చరిత్రలో మరో అద్భుత ఫలితం ఆవిష్కరణకు సిద్ధమైంది. హర్యానాలోని జింద్–సోనీపట్ మధ్య 89 కిలోమీటర్ల మేర...

ISRO: 12న PSLV-C62 ప్రయోగం…

PSLV-C62 రాకెట్ ప్రయోగానికి రంగం సిద్ధమైంది. శ్రీహరికోట నుంచి ఈ నెల 12న ఉదయం 10.17 గంటలకు రాకెట్...

Banks Strike : 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె…!

వారానికి 5 రోజుల వర్కింగ్ డేస్ కోసం దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ ఉద్యోగులు ఈ నెల 27న సమ్మె బాట...

More like this

Viswambhara :జులై 10న చిరంజీవి ‘విశ్వంభర’ రిలీజ్?

మెగాస్టార్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న భారీ ఫాంటసీ చిత్రం విశ్వంభర విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చినట్లు సినీ వర్గాలు...

Shankar Drea Project: నిర్మాత… కానీ కఠిన నిబంధనలతో!

భారతీయ సినీ పరిశ్రమలో విజువల్ గ్రాండియర్‌కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన దర్శకుడు శంకర్ ఎప్పటినుంచో కలగా భావిస్తున్న ప్రాజెక్ట్...

Champion Movie:OTTలోకి వచ్చేసిన ‘ఛాంపియన్’ మూవీ

యువ హీరో రోషన్ ప్రధాన పాత్రలో నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఛాంపియన్ ఇప్పుడు OTTలోకి వచ్చేసింది. గత...