Sunday, March 22, 2026
HomeNewsరైలులో ఏసీ పని చేయడం లేద‌ని కంప్లైంట్ఓపెన్ చేసి చూసి అధికారులు షాక్

రైలులో ఏసీ పని చేయడం లేద‌ని కంప్లైంట్ఓపెన్ చేసి చూసి అధికారులు షాక్

Published on

సాధార‌ణంగా రైలులో ప్ర‌యాణం చేసేట‌ప్పుడు ఏసీ కోచ్ లో ప్ర‌యాణం చేసే స‌మ‌యంలో, ఒక్కోసారి ఏసీలు ప‌నిచేయ‌కపోవ‌డం ఇలాంటి కంప్లైంట్లు వ‌స్తూ ఉంటాయి.

అయితే రైల్వే అధికారుల‌కి అక్క‌డ టెక్నిషియ‌న్ల‌కి తెలియ‌చేస్తే వెంటనే వారు స‌మ‌స్య ప‌రిష్క‌రిస్తారు. తాజాగా ఇటీవ‌ల ఇలాంటి ఘ‌ట‌న జ‌రిగింది. అయితే ఆ ఏసీ వ‌ర్క్ అవ‌డం లేద‌ని బ్లాక్ ఓపెన్ చేసి చూసి అధికారులు షాక్ అయ్యారు. అస‌లు ఏం జ‌రిగింది అంటే.

ఏసీ నుంచి గాలి రావడం లేదని ఫిర్యాదు చేస్తే, టెక్నీషియన్లు దాన్ని తెరిచి చూడగా లోపల వందల కొద్దీ విస్కీ బాటిళ్లు క‌నిపించాయి.

వార్నీ ఇదేం ప‌నిరా అని అంద‌రూ షాక్ అయ్యారు. లక్నో-బరౌనీ ఎక్స్‌ప్రెస్ రైలులోని ఏసీ-2 టైర్ కోచ్‌లో ఈ ఈ ఘ‌ట‌న అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురి చేసింది.

ప్ర‌యాణికులు ఎంత సేపు అయినా చ‌ల్ల‌గాలి రావ‌డం లేదు అని కంప్లైంట్ ఇచ్చారు. వెంట‌నే టెక్నికల్ సిబ్బంది, కోచ్‌లోని 32, 34 నంబర్ బెర్తుల పైన ఉన్న ఏసీ డక్టును తెరిచి చూశారు. అక్క‌డ ఏసీ డెక్ లో కొన్ని న్యూస్ పేప‌ర్ల‌లో విస్కి బాటిల్లు పెట్టి ఉన్నాయి ఏసీ గాలి రాకుండా అడ్డుగా అవి పెట్టి ఉంచారు. అధికారులు ఆ అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకుని, కోచ్ మొత్తం తనిఖీలు చేపట్టారు.

Also Read  Krishak Bharati Cooperative Limited (KRIBHCO), Graduate Engineer Trainee (GET) Recruitment for 2025.

అయితే ఇది కోచ్ లో సిబ్బంది ఎవ‌రైనా చేశారా దీని వెనుక ఎవ‌రు ఉన్నారు అనేదానిపై విచార‌ణ చేస్తున్నారు అధికారులు. ఈ వీడియో కూడా ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.


బీహార్‌లో 2016 నుంచి సంపూర్ణ మద్యపాన నిషేధం అమల్లో ఉంది. అయితే క‌ళ్లుగ‌ప్పి ఈ విధంగా మ‌ద్యం తీసుకువెళుతున్నారు కొంద‌రు. ఈ కోణంలో అధికారులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

రోడ్లు చెక్ పోస్టుల ద‌గ్గ‌ర పూర్తిగా చెకింగ్ జ‌రుగుతోంది. అయితే ఇలా రైలులో బల్క్ గా ఇలా మ‌ద్యం అక్ర‌మంగా త‌ర‌లించ‌డం మాత్రం ఇదే తొలిసారి అని అంటున్నారు అధికారులు. అయితే ఇక్క‌డ మ‌రో విష‌యం ఏమిటి అంటే? రైల్వే యార్డులోనే సిబ్బంది ప్రమేయంతో ఈ మద్యం లోడ్ చేసి ఉంటారని అనుమానాలు వ‌స్తున్నాయి.

Also Read  Gold Murder:బంగారం కోసం వృద్ధురాలి దారుణ హత్య..

Latest articles

Gold Murder:బంగారం కోసం వృద్ధురాలి దారుణ హత్య..

బంగారం కోసం వృద్ధురాలిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన నల్గొండ జిల్లా హాలియాలో తీవ్ర కలకలం రేపింది....

Blinkit: 10 నిమిషాల ఆన్లైన్ డెలివరీ బంద్..

గిగ్ వర్కర్ల డిమాండ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 10 నిమిషాల ఆన్లైన్ డెలివరీ విధానాన్ని...

Telangana govt:భారీగా బీర్ల ఉత్పత్తి.. కంపెనీలకు ప్రభుత్వ నిర్దేశం

వేసవికాలంలో బీర్లకు డిమాండ్ భారీగా పెరుగుతుండటంతో వాటి ఉత్పత్తిని మరింత పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత వేసవిలో రోజుకు...

Mary Kom Divorce:‘జూనియర్ బాక్సర్తో మేరీ కోమ్కు అఫైర్’.. మాజీ భర్త సంచలన ఆరోపణలు

తనను మోసం చేసి ఆస్తులు లాక్కున్నారన్న మేరీ కోమ్ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని ఆమె మాజీ భర్త...

Youtuber Anvesh :ట్రావెలింగ్ ఆపేస్తున్నా!

తాను ట్రావెలింగ్ ఆపేద్దామనుకుంటున్నట్లు యూట్యూబర్ అన్వేష్ తెలిపారు. “130 దేశాలు తిరిగాను. ఇక సంపాదించింది చాలు. నా దగ్గర...

Senior citizens : కోసం డేకేర్ సెంటర్లు..

తెలంగాణలోని వృద్ధులకు శుభవార్త. 60 ఏళ్లు పైబడిన వృద్ధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 37 ‘డేకేర్ సెంటర్లు’ ఏర్పాటు...

More like this

Viswambhara :జులై 10న చిరంజీవి ‘విశ్వంభర’ రిలీజ్?

మెగాస్టార్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న భారీ ఫాంటసీ చిత్రం విశ్వంభర విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చినట్లు సినీ వర్గాలు...

Shankar Drea Project: నిర్మాత… కానీ కఠిన నిబంధనలతో!

భారతీయ సినీ పరిశ్రమలో విజువల్ గ్రాండియర్‌కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన దర్శకుడు శంకర్ ఎప్పటినుంచో కలగా భావిస్తున్న ప్రాజెక్ట్...

Champion Movie:OTTలోకి వచ్చేసిన ‘ఛాంపియన్’ మూవీ

యువ హీరో రోషన్ ప్రధాన పాత్రలో నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఛాంపియన్ ఇప్పుడు OTTలోకి వచ్చేసింది. గత...