Tuesday, October 21, 2025
HomeNewsNCERT: పాత పుస్తకాలతోనే తరగతులు కొనసాగింపు – కొత్త సిలబస్ ఎప్పటికి?

NCERT: పాత పుస్తకాలతోనే తరగతులు కొనసాగింపు – కొత్త సిలబస్ ఎప్పటికి?

Published on

జాతీయ విద్యా పరిశోధనా మరియు శిక్షణ మండలి (NCERT) 2025-26 విద్యా సంవత్సరం నుంచి IV, V, VII మరియు VIII తరగతి పిల్లలకు కొత్త పాఠ్య పుస్తకాలు ప్రవేశపెడతామని ప్రకటించింది.

ఈ పుస్తకాలను ప్రచురించడానికి సంవత్సరం క్రితమే NCERT ఏర్పాట్లు ప్రారంభించింది. అయితే, పుస్తకాలు సమయానికి పూర్తి చేయడంలో విఫలమైంది, ఇది తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తోంది.

ఇప్పటికే గత ఏడాది కూడా III మరియు VI తరగతుల పాఠ్య పుస్తకాల విడుదల ఆలస్యం అయింది.

ఆ అకడెమిక్ సంవత్సరానికి ఏప్రిల్‌లో తరగతులు ప్రారంభమైనప్పటికీ, VI తరగతి గణిత శాస్త్రం మరియు సామాజిక శాస్త్ర పుస్తకాలు ఆగస్టులో మాత్రమే అందుబాటులోకి వచ్చాయి.

ఈ ఏడాది కూడా అన్ని పాఠశాలలు గత వారం కొత్త విద్యా సంవత్సరాన్ని ప్రారంభించాయి. కానీ ఇప్పటివరకు NCERT కేవలం IV తరగతికి హిందీ మరియు ఇంగ్లీష్ పుస్తకాలు, VII తరగతికి ఇంగ్లీష్ పుస్తకం మాత్రమే విడుదల చేసింది.

Also Read  Rahul Gandhi Vs EC: రాహుల్ గాంధీ ఆరోపణల తర్వాత ఈసీ స్ట్రాంగ్ కౌంట‌ర్

VII తరగతికి హిందీ పుస్తకం ఇంకా విడుదల కాలేదు. ఈ పుస్తకాలు NCERT వెబ్‌సైట్‌లో కూడా ఇంకా అప్‌లోడ్ కాలేదు.

IV, V, VII మరియు VIII తరగతుల కోసం మరే ఇతర కొత్త పాఠ్య పుస్తకాలు అందుబాటులో లేవు. అయితే V మరియు VIII తరగతుల కోసం అన్ని సబ్జెక్టులకు బ్రిడ్జ్ కోర్సులను NCERT సిద్ధం చేసి, తన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది.

CBSE (NCERT పాఠ్యాంశాలు అనుసరించే బోర్డు) మార్చి 26న విడుదల చేసిన సర్క్యులర్‌లో, పుస్తకాల విడుదలకు గడువు గురుంచి చెప్పింది.

కానీ ఆ ప్రకారం అన్ని సబ్జెక్టుల పుస్తకాలు ఏప్రిల్ 10 లోపు అందుబాటులో ఉండాల్సింది. VII తరగతికి సైన్స్ పుస్తకాలు ఏప్రిల్ 10న, గణిత పుస్తకాలు ఏప్రిల్ 20న అందుబాటులోకి రావాల్సి ఉంది.

కానీ ఇప్పుడు ఉన్న పరిస్థుల ప్రకారం ఈ పుస్తకాలు సమయానికి రావడం అనుమానమే.

V తరగతికి పుస్తకాలు జూన్ 15 నాటికి, VIII తరగతికి జూన్ 20 నాటికి అందుబాటులోకి వస్తాయని సర్క్యులర్ పేర్కొంది.

Also Read  "దేవర-1 సినిమా జపాన్‌లో" మార్చి 28,2025.

పాత పాఠ్యాంశం నుంచి కొత్త పాఠ్యాంశానికి మారటం కోసం విద్యార్థులకు సులువుగా ఉండేందుకు, NCERT V మరియు VIII తరగతులకు బ్రిడ్జ్ కోర్సులు సిద్ధం చేసింది.

ఢిల్లీకి చెందిన ఓ ప్రైవేట్ పాఠశాలలో VII తరగతి చదువుతున్న విద్యార్థి తండ్రి మాట్లాడుతూ, “మా స్కూల్ పాత NCERT పుస్తకాలనే బోధిస్తోంది.

అయితే సిలబస్ మారినట్లయితే పిల్లలకు తేడా వస్తుంది. సమయం పరిమితంగా ఉండగా, కొత్త సిలబస్ ఎలా పూర్తి చేస్తారు?” అని ప్రశ్నించారు.

Latest articles

Sliver Stolen: ఒక్కక్షణం ఆగినందుకు 11 కిలోల వెండి మాయం.

ఉత్తర తూర్పు ఢిల్లీలోని న్యూ ఉస్మాన్‌పూర్ ప్రాంతంలో ఆశ్చర్యపరిచే ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై జరిగిన చిన్న గొడవలో స్కూటర్...

ICC Women’s Cricket World Cup 2025: Full Schedule, Teams, Venues & Key Matches

The ICC Women’s Cricket World Cup 2025 is set to bring thrilling action to...

T20 Asia & EAP Qualifier 2025: వరల్డ్ కప్ అర్హతలు.

T20 వరల్డ్ కప్ అనేది ప్రపంచంలో టాప్ క్రికెట్ దేశాలు పోటీ పడే ఒక క్రికెట్ టోర్నమెంట్.ఇది చిన్న...

Bigg Boss Kannada 11: కాలుష్యం కారణంగా Karnataka Pollution Board ఆపేయమన్న ఆదేశం.

. బిగ్ బాస్ కన్నడ సీజన్ 11 షూటింగ్ ప్రదేశం చుట్టూ పర్యావరణ కాలుష్యం పెరుగుతోందని గుర్తించిన కర్ణాటక రాష్ట్ర...

Kerala Lottery:పేదలకు కలలు నెరవేర్చే ప్రభుత్వ బహుమతి

పరిచయం భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు మాత్రమే లాటరీలను చట్టబద్ధంగా నిర్వహిస్తున్నాయి. వాటిలో కేరళా రాష్ట్రం తన లాటరీ వ్యవస్థతో ప్రత్యేక...

High Court:కేవలం బాధితురాలి సాక్ష్యం సరిపోదు … హైకోర్టు పదేళ్ల జైలు శిక్షను రద్దు చేసింది.

హైదరాబాద్ కిషన్బాగ్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ ఇర్ఫాన్ఖాన్ పై నమోదైన అత్యాచార కేసులో నాంపల్లి కోర్టు విధించిన 10...

More like this

SSMB29 Glimpse Launch: మహేశ్ బాబు & రాజమౌళి కలయికతో ఇండియన్ సినీ హిస్టరీలో అతిపెద్ద ఈవెంట్!

తెలుగు సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహేశ్ బాబు – రాజమౌళి కాంబినేషన్ మూవీ SSMB29, ఇప్పుడు మరింత...

Google Data Center: APకి వెళ్లడం వెనుక ఉన్న నిజాలు..

గత కొన్ని రోజులుగా గూగుల్ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడులు పెట్టబోతోందనే వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. ఈ...

Final Destination: Bloodlines – భయానక హారర్ ఇప్పుడు Jio Hotstar లో

భయానక సినిమాలు చూడటం ఇష్టమా? అయితే మీకు గుడ్ న్యూస్! ప్రముఖ హారర్ ఫ్రాంచైజీ “Final Destination” సిరీస్‌లో...