Metro to College: షీ టీమ్స్ 203 మందిని పట్టుకున్నారు.

  • News
  • April 10, 2025
  • 0 Comments

రాచకొండ షీ టీమ్స్ మార్చిలో మహిళలపై వేధింపులకు పాల్పడిన 203 మందిని పట్టుకున్నారు.
శిక్షించబడిన వారు చాలా మంది కౌన్సిలర్స్ మరియు ప్రొఫెషనల్ సైకాలజిస్టులు రాచకొండ పోలీసులు నీర్వహించిన కౌన్సిలింగ్ సెషన్లకు హాజరయ్యారు.

గత ఒక నెలలో, రాచకొండ షీ టీమ్స్ కమిషనరేట్‌ పరిధిలోని వివిధ ప్రాంతాలలో మహిళలను వేధిస్తున్న 203 మందిని, అందులో 65 మంది మైనర్లను కూడా పట్టుకున్నారు. ఈ కేసుల్లో 14 క్రిమినల్ కేసులు మరియు 84 చిన్న కేసులు నమోదు చేయబడ్డాయి. మొత్తం 116 మందికి కౌన్సిలింగ్ నిర్వహించారు.

పోలీసుల చెప్పిన లెక్కల ప్రకారం, మార్చి 1 నుండి 30 మధ్యకాలంలో మెట్రో రైళ్లు, స్టేషన్లు, బస్‌ స్టాప్‌లు, పని ప్రదేశాలు మరియు కాలేజీల్లో ఉన్న హాట్‌స్పాట్ల నుండి వాట్సాప్ మరియు సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదులు వచ్చాయి. పట్టుబడిన వారు ఎల్‌బీ నగర్‌లోని పోలీస్ కమిషనర్ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన కౌన్సిలింగ్ సెషన్లకు హాజరయ్యారు.

అధికారుల వివరాల ప్రకారం, మెట్రో రైళ్లు వంటి వివిధ ప్రదేశాల్లో నిర్వహించిన డీకాయ్ ఆపరేషన్లలో 13 మందిని పట్టుకుని వారిపై జరిమానాలు విధించారు.

Also Read  శోకసంద్రంలో సినీ పరిశ్రమ: ప్రముఖ నటుడు మనోజ్ కుమార్ కన్నుమూత

ఇంతలో, రాచకొండ పోలీస్ స్వయం సహాయ సంఘాల కలిసి బాల్యవివాహాల ప్రతికూల ప్రభావాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

రాచకొండ పోలీస్ కమిషనర్ జి. సుధీర్ బాబు షీ టీమ్స్ పనిని ప్రశంసించారు మరియు మహిళలు ఆపదలో ఉన్నప్పుడు రాచకొండ షీ టీమ్స్‌ వాట్సాప్ నంబర్ 8712662111 ద్వారా లేదా డయల్ 100 ద్వారా సంప్రదించాలని చెప్పారు.

ఈ రోజుల్లో women harrassment cases చాలా ఎక్కువ అవుతున్నాయి. దీనికి కారణాలు ఎన్నో ముఖ్యంగా మనం ఆలోచించే విధానాలు, మనం తినే ఆహారం కూడా మన ఆలోచనలు నిర్ణయిస్తుంది. తండ్రులు పిల్లలు ఏమి చేస్తున్నారో జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. పిల్లతో ఫ్రెండ్లీ గా మాట్లాడాలి.

  • Related Posts

    • News
    • April 13, 2025
    • 22 views
    Reciprocal Tariffs: పరస్పర సుంకాలును తగ్గించిన ట్రంప్.

    యూఎస్ఏ ప్రెసిడెంట్ అయినటువంటి డోనాల్డ్ ట్రంప్ చాలా రోజుల నుంచి ప్రపంచవ్యాప్తంగా “Reciprocal Tariff” పెంచడం జరిగింది. కొన్ని వస్తువులైనటువంటి స్మార్ట్ ఫోన్స్ ,లాప్టాప్స్, చిప్స్ వీటన్నిటి మీద ఎటువంటి పాత విదానం ద్వారా Import & Export ఉండనున్నాయి. పలు…

    Read more

    • News
    • April 11, 2025
    • 32 views
    Break -UP: ప్రతీకారాన్నిపార్సిల్ రూపంలో బయటపెట్టిన ప్రియుడు.

    పశ్చిమ బెంగాల్‌కు చెందిన 25 ఏళ్ల యువకుడు, తన మాజీ Girl friend పై ప్రతీకారం తీర్చు కోవాడానికి, అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్‌ల ద్వారా దాదాపు 300 (COD) పార్సిళ్లను ఆమె నివాసానికి పంపాడు. బ్రేకప్ తర్వాత ‘ప్రతీకారం’ తీసుకోవాలని భావించిన…

    Read more

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *